Saturday, 13 June 2026 08:03:01 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

నూతన చట్టాలు వాటి అమలు పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

జిల్లా ఎస్పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి.. అదనపు ఎస్పి అడ్మిన్ ఎస్. మహేందర్

Date : 30 October 2024 10:25 PM

Telugu Rekha Media - ప్రాంతీయ వార్తలు / మెదక్ : జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో జిల్లా పోలీస్ అధికారులకు నూతన చట్టాలు వాటి అమలు పై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పి డి. ఉదయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ. నూతన చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అన్నారు. భారతీయ న్యాయ సంహిత బి.ఎన్.ఎస్, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత బి ఎన్ ఎస్ ఎస్, భారతీయ సాక్ష్యా అధినియం-2023 పై జిల్లాలలోని పోలీస్ అధికారులు, సిబ్బందికి ఇది వరకే శిక్షణ ఇచ్చామని జూలై ఒకటో తేదీ నుంచి దేశవ్యాప్తంగా భారతీయ న్యాయ సంహిత భారతీయ నాగరిక్ సురక్ష సంహిత భారతీయ సాక్ష్యా అధినియం-2023 చట్టాలు అమలులోకి వచ్చాయని అన్నారు. ప్రతీ పోలీస్ అధికారి, సిబ్బందికి కొత్త చట్టాలపై అవగాహన ఉండాలనే ఉద్దేశంతో శిక్షణా తరగతులు నిర్వహించామని తెలిపారు. కొత్త చట్టాలు అమలు జరిగిన వెంటనే ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని సెక్షన్లపై పూర్తి అవగాహన అవసరమన్నారు. నూతన చట్టాల ద్వారా కేసుల దర్యాప్తు, విధి విధానాలు, విచారణ పద్ధతుల్లో, శిక్షలలో మార్పు వస్తుందని, ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలందించేందుకు ఈ కొత్త చట్టాలు వీలుగా ఉంటాయన్నారు. అధికారులు, సిబ్బంది కొత్త చట్టాలను నేర్చుకొని అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ సమీక్షా సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ. అడ్మిన్ ఎస్. మహేందర్ ,తూప్రాన్ డిఎస్పీ వెంకట రెడ్డి, మెదక్ డిఎస్పీ. ప్రసన్న కుమార్,ఎస్బీ సిఐ సందీప్ రెడ్డి, డీసీఆర్బీ సిఐ మధుసూదన్ గౌడ్, జిల్లా సిఐ లు జిల్లా ఎస్సై లు, ఐటీ కోర్ సిబ్బంది అనిల్ తదితరులు పాల్గొన్నారు.

Telugu Rekha

Admin

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :