Telugu Rekha Media - ఎడ్యుకేషన్ / నిజామాబాద్ : రాష్ట్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో నిజామాబాద్ జిల్లా లో మూడు జిల్లాలు , నిజామాబాద్, మెదక్ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల రీజినల్ ట్రైనింగ్ సెంటర్ స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో డ్రాయింగ్ క్రాఫ్ట్ మ్యూజిక్ ట్రేడ్ల 42 రోజుల ట్రైనింగ్ శిబిరం ముగిసింది. ఈ శిభిరంలో దాదాపుగా నాలుగు వందల పైగా అభ్యర్థులతో నిర్వహించడం జరిగిందని క్రాఫ్ట్ డైరెక్టర్ డి.వాసుదేవరావు తెలిపారు. ఈ శిబిరంలో పాల్గొన్న విద్యార్థులు వారి యొక్క నైపుణ్యాలను పెంపొందించుకొని చివరి రోజు వారి యొక్క ప్రతిభను , సృజనాత్మకంగా వివిధ రకాల ప్రదర్శనల రూపంలోప్రదర్శించారు. ఇందులో సీనియర్ ఆర్ట్ టీచర్ టి కేశవ కుమార్, మరియు శ్రీనివాస్, నమత , మితి, గీత గార్లు విద్యార్థులను పరిచయం చేశారు. విద్యార్థులు కూడా ఈ శిబిరంలో మేము చాలా నైపుణ్యతను గురువుల ద్వారా నేర్చుకున్నామని అదిలాబాద్ విద్యార్థి ని వరలక్మి అందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇందులో సైకాలజీ, పాఠశాల యాజమాన్యం , ప్రత్యేక పాఠ్యం శాల పద్ధతులు నేర్చుకున్నామని ఆర్మూర్ విద్యార్థి సంతోష్ తెలిపారు. భవిష్యత్తులో వీరందరికీ ఉద్యోగాలు రావాలని క్రాఫ్ట్ డైరెక్టర్ డి. వాసుదేవరావు ఆకాంక్షించారు.
Reporter
Telugu Rekha Media