Telugu Rekha Media - కథనాలు / : చెత్తకుండీలో ఉండాల్సిన చెత్త రోడ్లపై పేరుకుపోతుంది ప్రతిరోజు ప్రజల ఇంటి నుండి తడి పొడి చెత్తను సేకరించాల్సిన మున్సిపల్ సిబ్బంది వారంలో ఒకరోజు మాత్రమే సేకరిస్తున్నారు, పైగా చెత్త సేకరణకు ప్రతి ఇంటి నుండి నెలకు 100 రూపాయలు డిమాండ్ చేస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. వారికి డబ్బులు చెల్లించలేక.. చెత్తకుండీలు అందుబాటులో లేని కాలనీవాసులు చెత్తను రోడ్లపై పడేస్తున్నారు.. కనీసం అలా రోడ్లపై ఉన్న చెత్తను క్రమంగా సేకరించి డంప్ యార్డుకు తరలించాల్సిన మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం వలన రోడ్లు చెత్త మయమవుతున్నాయి.. రోడ్లపై కుప్పలు కుప్పలుగా పేరుకుపోయిన చెత్త చెదారం ఈ వర్షాకాలంలో తడిసి దుర్గంధం వెదజల్లుతుంది. ఈ చెత్త మూలాన ఈగలు దోమలు ఉత్పత్తి చెంది, తద్వారా ప్రజలకు పలు రకాల వ్యాధులు మలేరియా, డెంగ్యూ లాంటి విషజ్వరాలు ప్రబలుతున్నాయి. ఇప్పటికైనా జిహెచ్ఎంసి అధికారులు స్పందించి.. చెత్త సేకరణకు ప్రజల నుండి డబ్బులను వసూలు చేస్తున్న సిబ్బందిపై చర్యలు తీసుకుని, తరచూ ఇండ్ల నుండి చెత్తను సేకరించేలా చర్యలు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.
Reporter
Telugu Rekha Media