Telugu Rekha Media - రాజకీయం / హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను ఫిరాయింపులకు పాల్పడేలా ప్రోత్సహిస్తున్న కాంగ్రెస్కు ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు స్పష్టం చేశారు. అధికార మత్తుతో విర్రవీగుతూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజల శక్తి అధికారంలో ఉన్న వారి బలం కంటే ఎప్పుడూ ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కూడా కాంగ్రెస్ అనేకసార్లు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందని విమర్శించారు.
Admin
Telugu Rekha Media