Telugu Rekha Media - రాజకీయం / సికింద్రాబాద్ : ఎంపీ అంటే మెట్రో పక్కా చేస్తా అనే నినాదంతో ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది. ఏ నమ్మకంతొనైతే ఆశీర్వదించి అత్యధిక మెజారిటీతో పార్లమెంట్ కు పంపించారో ఆ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు మెట్రో సాధనే మొదటి ప్రాధాన్యత గా తీసుకొవడం జరిగిందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు స్పష్టత చేశారు... బేగంపేట లోని మెట్రో రైల్ భవన్ కు ఎంపీ రఘు నందన్ చేరుకొని మెట్రో ఎండీ రెడ్డిని కలసి మెట్రో రైల్ మియాపూర్ నుండి పటాన్ చెరు వరకు, పటాన్ చెరు నుండి సంగారెడ్డి వరకు పొడిగింపు పనులను వెంటనే చేపట్టాలని వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా, అదే పటాన్ చెరు, సంగారెడ్డి ప్రజలకు లాభం చేకూరే మెట్రో రైల్ లైన్ పొడిగింపు కోసం పని చేస్తానని హామీనివ్వడం జరిగిందని అదే విధంగా ఎన్నికల నోటిఫికేషన్ కన్నా ముందే బీజేపీ ఆద్వర్యంలో సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు కూడా పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. మెట్రో లైన్ పొడిగింపు కోసం ప్రతి నెల అధికారులతో టచ్ లో ఉంటానని వెల్లడించారు.
Reporter
Telugu Rekha Media