Telugu Rekha Media - రాజకీయం / పెద్దపల్లి : జిల్లాల్లో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొన్న మంత్రులు పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనురు లో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర నూతన భవనాన్ని ప్రారంభించిన మంత్రులు.. పెద్దపల్లి ఓదెల వయా కొత్తపల్లి కూలనూరు రోడ్డు అభివృద్ధికి శంఖుస్థాపన. అనంతరం కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని పెద్దరాత్ పల్లి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యాన, పట్టు పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో తిరుమల ఆయిల్ కెం. ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ కి శంఖుస్థాపన చేసిన మంత్రులు. కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మేల్యేలు చింతకుంట విజయ రమణ రావు, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ఎమ్మెల్సీ భాను ప్రసాద్, ఎంపి గడ్డం వంశి ,జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష, వివిధ విభాగాల అధికారులు. అనంతరం రెడ్డి ఫంక్షన్ హల్ ఏర్పాటు చేసిన రైతుల సభలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.zశంలోనే మొదటిసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేసింది తెలంగాణ ప్రభుత్వం మాత్రమే.నిన్ననే రైతు రుణమాఫీ చేయడానికి నాయకత్వం వహించిన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు.భారత దేశ చరిత్రలో ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు వంటి మే 6 వ తేది 2022 లో ఇచ్చిన హామీని రేవంత్ రెడ్డి నాయకత్వంలో నిలబెట్టుకుంది.ఇది కళన నిజమా అని రైతులు అనుకుంటున్నారు.త ప్రభుత్వం లక్ష రూపాయలు రుణమాఫీ నీ 4-5 కిస్తిల్లో ఇచ్చారు.మేము లక్ష రూపాయలు రుణమాఫీ ఒకసారి తరువాత లక్ష 50 వేలు,తరువాత 2 లక్షల రుణమాఫీ ఒకేసారి జరుగుతుంది.ఆయిల్ ఫాం ఎలాంటి ఇబ్బందీ కర పరిస్థితులు ఉన్న అన్ని ఖర్చులూ పొగ లక్షల్లో ఆదాయం వస్తుంది.ఆయిల్ ఫాం లో అంతర్ పంటలు వేసుకోవచ్చు.2 లక్షల 103 మెట్రిక్ టన్నుల ఆయిల్ మార్కెట్ జరుగుతుంటే బయటి దేశాల నుండి దిగుమతి చేసుకుంటున్నాం. రాష్ట్రంలో 2 లక్షల ఎకరాల పైన ఆయిల్ ఫాం పెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.పెద్దపల్లి జిల్లాలో 45 వేల ఎకరాల్లో ఆయిల్ ఫాం పెట్టడానికి ఇక్కడ ఆయిల్ ఫాం ఫ్యాక్టరీ నీ ఏర్పాటు చేస్తున్నారు. కొత్త బస్సులకు పెద్ద ఎత్తున డిమాండ్స్ వస్తున్నాయి..చాలా చోట్ల కొత్త బస్సులు ఏర్పాటు చేస్తున్నాం.రేవంత్ రెడ్డి నాయకత్వంలో 3 వేలకు పైగా నియామకాలకు ఆదేశాలు జారీ చేసింది.ఇప్పటికే వెయ్యికి పైగా బస్సులు కొనుగోలు చేశాం. మరో 1500 బస్సులు వస్తున్నాయి. ఆర్థిక పరిపుష్టి శక్తి రైతన్న దగ్గరే ఉంది.రైతన్నలకు ఆర్థిక శక్తిగా ఎదగాలి.డిసెంబర్ 3 న గెలిచినము.7 న మంత్రి అయినం.9 నాడు ఆర్టీసి లో మహిళలకు ఉచిత బస్సు అందించాం.ఇప్పటి వరకు 62 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారు. 2100 కోట్లకు పైగా ఆర్టీసి కి చెల్లించింది.మహా లక్ష్మి పథకం తో ఆర్టీసి ఆపరేషనల్ లాస్ లేకుండా నడుస్తుంది. పెద్దపల్లి లో ఆర్టీసి బస్సు డిపో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటాం.గోదావరి ఖని బస్సు స్టాండ్ రూపురేఖలు మారుస్తాం. ఆర్టీసి ఉద్యోగులకు పీ ఆర్సి ఇచ్చాం. 2013 నాటి పెండింగ్ బాండ్లు చెల్లించాం.
Reporter
Telugu Rekha Media