Wednesday, 15 April 2026 03:41:34 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

కుటుంబంపై దాడి..వృద్దురాలు మృతి..ముగ్గురికి తీవ్ర గాయాలు...

Date : 19 July 2024 11:40 AM

Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / తిరుపతి : తిరుపతి నగరం రాయల్ నగర్ లో జరిగిన ఘటన కలకలం రేపింది. ఒక కుటుంబంపై గుర్తు తెలియని దుండగులు కత్తితో చేసిన దాడిలో ఒకరు మృతి చెందారు. ముగ్గురుకి తీవ్ర గాయాలు అయ్యాయి. ఘటనతో నగరం ఉలిక్కిపడింది. దుండగులు బాలికను గొంతు కోసి మరో బాలికపై, తల్లిపై కత్తులతో దాడి చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆసుపత్రికి తరలించారు. బాలిక పరిస్థితి విషమంగా ఉంది. ఘటన స్థలానికి చేరుకున్న తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు మీడియాతో మాట్లాడుతూ రాయల్ నగర్ లో మర్డర్ జరిగిన సంఘటన ప్రాంతాన్ని పరిశీలించాం. మర్డర్ కు సంబంధించి కొన్ని క్లూస్ దొరికాయన్నారు. బసవయ్య అండ్ కంపెనీ ఓనర్ శ్రీనివాసులు కుటుంబంపై దాడి చేశారని, శ్రీనివాసులు ఇంట్లో లేని సమయంలో దాడి చేసారని అన్నారు. శ్రీనివాసులు తల్లి జయలక్ష్మిపై కత్తితో అతి కిరాతకంగా దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందింది. శ్రీనివాసులు చిన్న కుమార్తె నియాతిపై కత్తితో దాడి చేశారని తెలిపారు.డ్రైవింగ్ క్లాస్ కు వెళ్ళి తిరిగి వచ్చిన శ్రీనివాసులు భార్య సురక్ష, పెద్ద కుమార్తె ప్రేరణ పైనా కత్తితో దాడి చేసి గాయపరచారన్నారు. దాడి చేసిన తర్వాత నిందితుడు బురఖా లో తప్పించుకున్నట్లు సిసి కెమెరాలో ఫుట్టేజ్ లభించాయని చెప్పారు. కుటుంబ తగాదాలే కారణమని అనుమానిస్తున్నారు. త్వరలో కేసు మిస్టరీ ఛేదించి నిందితులను అదుపులో తీసుకుంటామని ఎస్పీ అన్నారు. ఘటనపై ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు స్పందించారు. రాయల్ నగర్ ఘటన బాధాకరం. నిందితుడు విచక్షణారహితంగా దాడికి పాల్పడినట్లు ఘటనను చూస్తే తెలుస్తోంది. నిందితుడిని వెంటనే అరెస్ట్ చేయాలి. ఇలాంటి ఘటనలు తిరుపతిలో పునరావృతం కాకుండా చూడాలని అన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :