Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / హైదరాబాద్ : చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ దారుణ హత్యకు గురైంది. నల్లగండ్ల లక్ష్మి విహార్ లో విజయలక్ష్మి నివాసం ఉంటుంది. నిందితుడు కత్తితో కిరాతకంగా మహిళ గొంతు కోసి హత్యకు పాల్పడ్డాడు. హత్యకు గురైన మహిళా స్వస్థలం కర్ణాటక రాష్ట్రంగా గుర్తించిన పోలీసులు. హత్య చేసిన నిందితుడు పోలీస్ స్టేషన్ లో లొంగిపోయినట్లు సమాచారం. ఘటన స్థలికి చేరుకున్న క్లూస్ టీం, చందానగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. హత్య వెనుకగల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Reporter
Telugu Rekha Media