Telugu Rekha Media - క్రైమ్ వార్తలు / ఖమ్మం : మద్యం మత్తులో ఓ ఎస్సై కార్ డ్రైవింగ్ చేస్తూ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన సంఘటన ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మహబూబాద్ జిల్లా సీరోల్ మండలం ఎస్సైగా పనిచేస్తున్న విజయ్ కుమార్ రాత్రి స్నేహితులతో కలిసి మహబూబాబాద్ వైపు నుంచి ఖమ్మం వైపుకు వస్తున్నారు. మద్యం సేవించి కార్ డ్రైవింగ్ చేస్తున్న ఎస్సై మార్గమధ్యలోని ములకలపల్లి వద్ద ఓ ఆటో ను ఢీ కొట్టి ఖమ్మం రూరల్ మండలం కాచిరాజు గూడెం వద్ద కార్ అదుపుతప్పి పంట పొలంలోకి పల్టీ కొట్టింది ఈ ఘటనలో ఎస్సై నుదుటి భాగాన బలమైన గాయమైనట్లు తెలిసింది.కారులో ఉన్న తోటి స్నేహితులు సహాయంతో చికిత్స నిమిత్తం ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Reporter
Telugu Rekha Media