Telugu Rekha Media - జిల్లా వార్తలు / జగిత్యాల్ : మొక్కలు నాటి సంరక్షించడం ప్రతి ఒక్కరి సామాజిక భాధ్యత అని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛధనం-పచ్చధనం కార్యక్రమంలో భాగంగా జగిత్యాల పురపాలక శాఖ ఆధ్వరంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా జిల్లా పోలీస్ కార్యాలయంలోని పరెడ్ మైదానంలో ఏర్పాటు చేసిన మొక్కలు నాటే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జగిత్యాల ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్, జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ పాల్గొని మొక్కలు నాటారు.. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. అర్బన్ పార్కుతో పట్టణ ప్రజలకు ఆహ్లాదం వాతావరణం లభించిందన్నారు.. వాచ్ టవర్ ఏర్పాటు తో అడవి మరియు పట్టణం వీక్షించడం వల్ల కనువిందు చేస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా జగిత్యాల జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణం జరిగిందని ముఖ్యమంత్రి డబుల్ బెడ్ రూం ఇండ్ల మౌలిక వసతుల కల్పన కోసం నిధులు కూడా మంజూరు చేయటం జరిగిందన్నారు.. డబల్ బెడ్ రూం ఇండ్ల వద్ద సైతం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు. వృక్షో రక్షితి రక్షితః.. మనం మొక్కల్ని రక్షిస్తే మొక్కలు మనల్ని రక్షిస్తాయిని, పట్టణ ప్రజలు తడి పొడి చెత్త వేరు చేయటం ద్వారా ఎరువులు తయారు చేయవచ్చు అని, పర్యావరణానికి హాని కలగకుండా ఉంటుందని అన్నారు. పట్టణంలో పలు చోట్ల పార్కులు కూడా ఏర్పాటు చేయటం జరిగిందని అన్నారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛధనం- పచ్చధనం కార్యక్రమంలో భాగస్వామ్యం కావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ భీం రావు, డీఎస్పీ రఘు చందర్, కమిషనర్ సమ్మయ్య, స్థానిక కౌన్సిలర్ శ్రీలత రామ్మోహన్ రావు, సిఐ కృష్ణ రెడ్డి,ఏవో శ్రీనివాస్, కౌన్సిలర్ లు పంబల రాంకుమార్ త్యాదాస్ నవీన్ జుంబర్తి రాజ్ కుమార్ కోసరి అనిల్ ముస్కు నారాయణ రెడ్డి, కో ఆప్షన్ శ్రీనివాస్, నాయకులు క్యదాసు నాగయ్య, కూతురు శేఖర్, ప్రభాత్ సింగ్ ఠాగూర్, దుమాల రాజ్ కుమార్, శరత్ రావు, గట్టు రాజు, పోతునుక మహేష్, క్రాంతి, కొలగాణి సత్యం, ప్రవీణ్, లవంగ శ్రీనివాస్, రాజమల్లు, మేక పవన్, ఎస్ఐలు, ఆర్ఐలు, అధికారులు, పోలీస్ సిబ్బంది, మహిళలు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media