Wednesday, 15 April 2026 03:52:20 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలలో పోలీస్ కవాతు రిహార్సల్స్...

భద్రత ఏర్పాట్ల ను పరిశీలించి పోలీస్ అధికారులకు పలు ఆదేశాలు జారీ... -- జిల్లా ఎస్పీ అదిరాజ్ సింగ్ రాణా.

Date : 14 August 2024 07:35 PM

Telugu Rekha Media - జిల్లా వార్తలు / నంద్యాల : నంద్యాల పట్టణంలోని గవర్నమెంట్ కళాశాల మైదానంలో ఆగస్టు 15 (గురువారం) స్వాతంత్రదినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన పోలీస్ కవాతు రిహార్సల్స్ ను నేడు జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా ఐపీఎస్ గవర్నమెంట్ కళాశాల మైదానానికి రాగానే ముందుగా జాతీయ జెండాను ఎగురవేశారు.అనంతరం పోలీస్ పెరేడ్ రిహార్సల్ లో భాగంగా జిల్లా ఎస్పీ పెరేడ్ కమాండర్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ మంజునాథ్ నుండి గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం కవాతు పరిశీలన వాహనంలో జిల్లా ఎస్పీ వెళ్ళి ఆర్మూర్ రిజర్వ్ బలగాలు, సివిల్ పోలీసులు, మరియు హోంగార్డ్స్ తో పాటు ఎన్.సి.సి, స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులను పరిశీలించి పోలీస్ కవాతు రిహార్సల్స్ ను పరిశీలిస్తూ వివిధ విభాగాల నుండి గౌరవ వందనం స్వీకరించారు.అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు విచ్చేయనున్న ప్రముఖులు, స్వాతంత్య్ర సమర యోధుల కుటుంబాలు, ఉన్నతాధికారులు, ప్రజల గ్యాలరీల ఏర్పాట్లు, కల్పించాల్సిన భద్రత మొదలగు సౌకర్యాల గురించి పోలీస్ అధికారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకుని ఏర్పాట్లు ఘనంగా చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు ఇన్స్పెక్టర్లు నరసింహులు, మంజునాథ్ ,శ్రీనివాసులు ఆర్ఎస్ఐ లు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :