Telugu Rekha Media - జాతీయం / : న్యూ ఢిల్లీ, (తెలుగురేఖ న్యూస్) : భూపతిరాజు శ్రీనివాస వర్మ ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ మంత్రి గా పదవీ స్వీకారం చేసారు. తరువాత అయన మీడియా తో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాపై ఉంచిన భాద్యతలు ను వమ్ము కాకుండా నిర్వర్తిస్తాను. నేను ఈ స్థాయికి రావడానికి జాతీయ, రాష్ట్ర నేతలు చాలా మంది సహకరించారు . 35 సం.ల పార్టీ లో ఇస్తాయికి తీసుకునిరావడం తో, కేంద్ర మంత్రి స్థాయికి తీసుకుని వచ్చిన నాయకులకు ధన్యవాదాలు. రెండు శాఖ లకు నేను మంత్రిని ఈరెండు శాఖలకు మంచి పేరు తీసుకుని వస్తాను. ప్రభుత్వ పాలసిలకు అనుగుణంగా నిర్ణయాలు ఉంటాయి. పనులు త్వరితగతిన పూర్తి చేయాలని ప్రధానమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు తీసుకుని వెళ్తాను. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తో సమావేశం అయి అభివృద్ధి కి కృషి చేస్తా. రాష్ట్రం నుండి వెనక్కు వెళ్లిన పరిశ్రమలు తీసుకుని వస్తాను. పరిశ్రమలకు భూమూల కేటియింపుకు చర్యలు, ఉపాధి అవకాశాలు పెంచుతాం. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు, బిజెపి రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, సిఎం రమేష్, మంత్రి కింజరాపు రామ్మోహన్, మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ర తో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లతో చర్చించి రాష్ట్ర అభివృద్ధి లో కీలక పాత్ర వహిస్తాను. ఎమ్మెల్యేల సహకారం తో నరసాపురం పార్లమెంట్ అభివృద్ధి కి కృషి చేస్తా. వైజాగ్ స్టీల్ విషయంలో కేంద్ర ప్రభుత్వం విధానపరంగా నిర్ణయం. చంద్రబాబు, పవన్ ఎన్డీయే కూటమి అధికారంలోఉన్నాం, వారితో సమావేశం అనంతరం విశాఖ ఉక్కు పై వివరాలు ప్రకటిస్తాం. యువతకు పరిశ్రమల ద్వారా ఉపాధి కల్పించడమే నా లక్ష్యమని అన్నారు.
Reporter
Telugu Rekha Media