Telugu Rekha Media - జాతీయం / : న్యూఢిల్లీ (తెలుగు రేఖ న్యూస్) : ప్రభుత్వం వఖ్ఫ్ (సవరణ) బిల్లు 2024ను త్వరలో లోక్ సభలో ప్రవేశపెట్టనున్నది. వక్ఫ్ చట్టం 1995కు కొన్ని మార్పులు తెచ్చి ఈ కొత్త బిల్లును ప్రవేశపెట్టనున్నారు. ఈ కొత్త బిల్లు ప్రకారం ‘జిల్లా కలెక్టర్లకు’ కొన్ని అధికారాలను కల్పించారు. దాని ప్రకారం వక్ఫ్ చట్టం కు సంబంధించిన వివాదాలను పరిష్కరించే అధికారాలు కలెక్టరుకు కల్పించారు.ముసాయిదా బిల్లు లో ‘వక్ఫ్’ పదాన్ని ‘యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్ మెంట్, ఎంపవర్ మెంట్, ఎపిసియన్సీ అండ్ డెవలప్ మెంట్’ అని మార్చారు. ఇదిలావుండగా వక్ఫ్ చట్టం 1995లో మార్పులు చేసిన సవరణ బిల్లును ప్రభుత్వం పార్లమెంటులో ప్రవేశపెడితే దానిని వ్యతిరేకిస్తామని అనేక ప్రతిపక్ష పార్టీలు తెలిపాయి.
Reporter
Telugu Rekha Media