Telugu Rekha Media - జాతీయం / : పారిస్: భారత షూటర్ మనూ భాకర్ చరిత్ర సృష్టించింది. ఒకే ఒలింపిక్స్లో రెండు పతకాలు గెలిచిన తొలి భారతీయ క్రీడాకారిణిగా ఆమె రికార్డు క్రియేట్ చేసింది. మనూ భాకర్ తొలుత మహిళల10మీటర్ల ఎయిర్ పిస్తోల్ ఈవెంట్లో, ఆ తర్వాత 10 మీటర్ల ఎయిర్ పిస్తోల్ మిక్స్డ్ ఈవెంట్లో కాంస్య పతకాలు గెలిచింది. గతంలో ఇండియా తరపున ఒకే ఒలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన అథ్లెట్లలో నార్మన్ ప్రిచార్డ్ ఉన్నారు. 1900 సంవత్సరంలో జరిగిన పారిస్ ఒలింపిక్స్లోనే అతను ఆ రికార్డును అందుకున్నాడు. 200 మీటర్ల హార్డిల్స్, 200 మీటర్ల రేస్లో.. నార్మన్ ప్రిచార్డ్ సిల్వర్ పతకాలను గెలిచారు.
Reporter
Telugu Rekha Media