Telugu Rekha Media - జాతీయం / : ప్యారీస్: 2024 సమ్మర్ ఒలింపిక్స్ జులై 26 నుంచి ఆగస్టు 11 వరకు ఫ్రాన్స్ రాజధాని ప్యారీస్ లో జరిగాయి. తదుపరి 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్ లో జరుగనున్నట్లు ప్రకటించారు. అంతేకాక ఒలింపిక్ బ్యాటెన్ ను లాస్ ఏంజెల్స్ కు అందజేశారు. ఇదిలావుండగా అమెరికా క్రీడాకారులు 40 బంగారు పతకాలు, 44 వెండి పతకాలు, 42 కాంస్య పతకాలు గెలుచుకుని ప్రథమ స్థానంలో నిలిచారు. కాగా చైనా బంగారు పతకాల్లో అమెరికాకు సమంగా నిలిచినప్పటికీ రెండో స్థానానికే పరిమితమైంది. ఒక్క బంగారు పతకం కూడా సాధించని భారత్ 71 వ స్థానానికి పరిమితమయింది. భారత్ 5 కాంస్య పతకాలు, ఒక వెండి పతకాన్ని గెలుచుకుంది. కాగా అనర్హరతకు గురైన వినేశ్ ఫొగట్ కేసు కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ లో కొనసాగుతోంది. తొలిసారి బంగారు పతకం సాధించిన పాకిస్థాన్ 62వ స్థానంలో ఉంది. ఇక జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్ మూడు, నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి.
Reporter
Telugu Rekha Media