Telugu Rekha Media - జాతీయం / : (తెలుగు రేఖ న్యూస్): కువైట్లో జరిగిన అగ్నిప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల మృతదేహాలను ప్రత్యేక విమానంలో అధికారులు కేరళకు తీసుకొచ్చారు. ఈ నెల 12న కువైట్లో జరిగిన భారీ అగ్నిప్రమాదంలో 45 మంది భారతీయులు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ మృతదేహాలను వాయుసేన విమానంలో కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకొచ్చారు. కేరళ సీఎం పినరయి విజయన్, కేంద్రమంత్రి సురేశ్ గోపి ఇప్పటికే నివాళులర్పించారు.
కువైట్ అగ్ని ప్రమాదం విషయం తెలిసి తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. .బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపిన ప్రధాని. తక్షణ సాయంగా మృతుల కుటుంబాలకు 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
Reporter
Telugu Rekha Media