Wednesday, 29 July 2026 03:13:51 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

10 లక్షల వరకు ఆయుష్మాన్ భారత్...

Date : 09 July 2024 10:33 AM

Telugu Rekha Media - జాతీయం / హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఈ నెలలో పూర్తి బడ్జెట్ (కేంద్ర బడ్జెట్ 2024)ను ప్రవేశపెట్టనుంది. ఈ సారి దేశంలో సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి అది జనాకర్షకంగా ఉంటుందని సర్వత్రా భావిస్తున్నారు. ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన (పీఎంజేఏవై), ఆయుష్మాన్ భారత్ పథకానికి సంబంధించి ప్రభుత్వం ఈ బడ్జెట్ లో కొన్ని కీలక ప్రకటనలు చేసే అవకాశం ఉంది. ఆయుష్మాన్ భారత్ పథకం కింద కవరేజీ పరిమితిని రూ. 5 లక్షల నుంచి పెంచే అంశాన్ని కేంద్రం పరిశీలిస్తోంది, ఆయుష్మాన్ భారత్-ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన లబ్ధిదారుల సంఖ్య, భీమా మొత్తాన్ని పెంచాలని ఎన్డీయే ప్రభుత్వం ఆలోచిస్తోంది. ఈ పథకం కింద లబ్ధిదారులకు లభించే కవరేజీ పరిమితిని ఏడాదికి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే మూడేళ్లలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య బీమా పథకం కింద లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేయాలని ఎన్డీయే ప్రభుత్వం భావిస్తోంది.రాబోయే మూడేళ్లలో ఏబీ-పీఎంజేఏవై కింద లబ్ధిదారుల సంఖ్యను రెట్టింపు చేస్తామని ప్రభుత్వం ప్రకటిస్తే.. దేశ జనాభాలో మూడింట రెండొంతుల మందికి ఆరోగ్య రక్షణ లభిస్తుంది. చికిత్స కోసం భారీగా ఖర్చు చేయడం కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టడానికి ప్రధాన కారణాల్లో ఒకటి కాబట్టి ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలిస్తోందని నివేదిక వర్గాలు తెలిపాయి. ఆయుష్మాన్ యోజన కవరేజీ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే ప్రతిపాదనను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని తెలిపారు.

కేంద్రం ఈ నెలలో సాధారణ బడ్జెట్ ను ప్రవేశపెట్టబోతోంది. జూలై 23న బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నట్లు నిర్ణయించారు. ఈ ప్రతిపాదనలు లేదంటే అందులోని కొన్ని భాగాలను ఈ బడ్జెట్‌లో ప్రకటించే అవకాశం ఉంది. ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ రూపొందించిన అంచనాల ప్రకారం ప్రభుత్వ ఖజానాపై ఏటా రూ.12,076 కోట్ల అదనపు భారం పడుతుంది. 70 ఏళ్లు పైబడిన వారితో సహా మరో 4-5 కోట్ల మంది లబ్ధిదారులు ఈ పథకం పరిధిలోకి వస్తారని తెలుస్తోంది.ఆయుష్మాన్ భారత్-పీఎంజేఏవైకి రూ.5 లక్షల పరిమితిని 2018లో నిర్ణయించారు. ఇప్పుడు ద్రవ్యోల్బణం, మార్పిడితో సహా ఇతర ఖరీదైన చికిత్సల విషయంలో కుటుంబాలకు ఉపశమనం కలిగించేందుకు, ఈ పథకం కింద అందుబాటులో ఉన్న కవరేజీ పరిమితిని రెట్టింపు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నారు. జూన్ 27న పార్లమెంట్ సంయుక్త సమావేశంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మాట్లాడుతూ 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ ఆయుష్మాన్ పథకం వర్తిస్తుందని, వారికి ఉచిత వైద్యం అందుతుందని చెప్పారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: