Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / గుంటూరు : తాడేపల్లిలో వైకాపా కార్యాలయాన్ని కూల్చేయడంపై వైఎస్ జగన్ స్పందించారు. రాజకీయ కక్షసాధింపు చర్యలకు చంద్రబాబు దిగారు. తన దమనకాండను మరోస్థాయికి తీసుకెళ్లారు. నియంతలా దాదాపు పూర్తికావొచ్చిన వైకాపా కార్యాలయాన్ని కూల్చేయించారు. హైకోర్టు ఆదేశాలనూ బేఖాతరు చేశారు. రాష్ట్రంలో చట్టం, న్యాయం కనుమరుగైపోయాయి. దేశంలోని ప్రజాస్వామ్య వాదులంతా బాబు దుశ్చర్యలను ఖండించాలి. ఈ బెదిరింపులకు తలొగ్గేది లేదు' అని ట్వీట్ చేశారు.
Admin
Telugu Rekha Media