Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / అమరావతి : మరో రెండ్రోజుల్లో ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో తొలిరోజు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. గత ఎన్నికల్లో 151 సీట్లతో చరిత్ర సృష్టించిన వైసీపీ ఈసారి 11 సీట్లకు మాత్రమే పరిమితమై ప్రతిపక్ష హోదానూ కోల్పోయింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ అసెంబ్లీకి వెళ్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. వెల్లని పక్షంలో సమావేశాల అనంతరం స్పీకర్ ఛాంబర్లో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.
Admin
Telugu Rekha Media