Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / కర్నూల్ : పత్తికొండ పట్టణంలో మండల పరిషత్ కార్యాలయం లో ఎంపీడీవో రామారావు ,ఆధ్వర్యంలో డయోరియా అవగాహన సమావేశం నిర్వహించారు, అనంతరండాక్టర్ అరుణ్ కుమార్, డాక్టర్ సుజాత వారు మాట్లాడుతూ ఈ సీజన్ లో ఇంటింటి సర్వే చేసి వాంతులు, విరేచనాలు అయ్యేవారికి ఓఆర్ఎస్ పాకెట్స్ మరియు జింక్ మాత్రలు ఇవ్వాలని, వేడి చేసి చల్లారిన నీటిని త్రాగ వలెనని, శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలని మరియు దోమలవలన వచ్చే మలేరియా, డెంగ్యూ జ్వరాలు రాకుండా ప్రతి ఒక్కరూ వారానికొకసారి డ్రమ్ములు, తొట్టెలు, బిందెలు శుభ్రముగా కడిగి అరగంట ఆరిన తర్వాత నీరు నింపుకొనవలేనని , ఇంటి పరిసరాలలో టైర్లు, రోళ్లు, కొబ్బరి బోండాలు, ప్లాస్టిక్ వస్తువులు, పాత కూలర్లు,పులకుండీలలో నీరు చేరకుండా చూడాలని,ఎప్పటికప్పుడు డ్రైనేజీలు శుభ్రము చేయాలని, దోమలు కుట్టకుండా దోమతెరలు వాడాలని, సాయంత్రము పూట వేపాకు పొగ వేసుకోవాలని ప్రజలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని లైన్ డిపార్ట్మెంట్స్ సహకారముతో చేయాలని వైద్య సిబ్బందికి తెలియచేశారు.
Reporter
Telugu Rekha Media