Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / విశాఖపట్నం : గోపాలపట్నంలో రైస్ పుల్లింగ్ మోసం బయటపడింది. రాజుల కాలం నాటి రాగి కాయిన్ అమ్మి లక్షా డెబ్భై వేలు ఇద్దరు కేటుగాళ్ళు కొట్టెసారు. గోపాలపట్నం కి చెందిన ఇద్దరు వ్యక్తులను తెలంగాణా అశ్వారావు పేటకు చెందిన గుత్తల నారాయణ రావు, మరొక వ్యక్తి మోసం చేసారు. విశాఖలో ఒక బారులో వీరి ముగ్గురికి పరిచయంఅయింది. తాము మోసపోయామని తెలుసుకుని నారాయణారావు ను 10 రోజులుగా ప్రహ్లాదపురం శ్రీ శివసాయి ప్లాట్ లో బాధితులను బంధించారు. నారాయణరావు అశ్వరావు పేటలో ఉంటున్న తన కుమారుడికి నన్ను కిడ్నాప్ చేశారని తెలపడంతో వ్యవహారం బయటపడింది. నారాయణారావు కుమారుడు పోలీసులకు సమాచారం అందించాడు. ప్రహ్లాదపురం అపార్ట్మెంట్ ప్లాట్ లో నిందితులను, కిడ్నాప్ చేసిన వ్యక్తులను గోపాలపట్నం పోలీసులువిచారిస్తున్నారు.
Reporter
Telugu Rekha Media