Wednesday, 15 April 2026 03:47:37 PM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

ఏసీబీ వలలో తహశీల్దార్..

Date : 16 July 2024 03:08 PM

Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / అనంతపురం : భూమికి సంబంధించి ఆన్లైన్లో పేరు నమోదుకు ఓ వ్యక్తి నుంచి డబ్బును లంచంగా తీసుకున్న వజ్రకరూరు తహసీ ల్దార్ మహమ్మద్ రఫీని ఏసీబీ అధికా రులు వలపన్ని పట్టు కున్నారు. ఏసీబీ డీఎస్పీ జెస్సి ప్రశాంతి మాట్లాడుతూ.. వజ్రకరూరు మండలం, ధర్మపురి గ్రామానికి చెందిన మల్లికార్జున చాబాల గ్రామ పరిధిలో ఉన్న తన 5.50 ఎకరాల భూమిని అదే గ్రామానికి చెందిన ఆదినారాయణ రెడ్డి వద్ద కొన్నేళ్ల కిందట రిజిస్ట్రేషన్ అమ్మకం పెట్టాడు. మల్లికార్జున మృతి చెందడంతో కుటుంబ సభ్యులు భూమిని ఆదినారాయణ రెడ్డి అనే మరో వ్యక్తి కి అమ్మేశారు. ఆయన బెళుగుప్పకు చెందిన తన కుమార్తె సరళ పేరున భూమి బదలాయించారు. దానికి సంబంధించి పట్టాదారు పాసుపుస్తకాలు వచ్చాయి. కాని ఆన్లైన్లో పేరు నమోదు కాలేదు. పేరు నమోదు చేయాలని సరళ భర్త వెంకటేశ్ వజ్రకరూరు తహసీల్దార్ మహమ్మద్ రఫీని కలిశారు. అందుకు ఆయన రూ. లక్ష డిమాండు చేశారు. చివరికి రూ.70 వేలకు బేరం కుదుర్చుకున్నారు. తరువాత వెంకటేశ్ అనంతపురం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ముందుగా కుదుర్చు కున్న ఒప్పందం ప్రకారం నగదు చెల్లిస్తానని వెంకటేశ్ చెప్పడంతో తహసీల్దార్ వారి బంధువు ఫోన్ పే నంబరు ఇచ్చారు. ఆ నంబరుకు రూ.65 వేలు జమ చేయగానే ఏసీబీ అధికారులు తహసీల్దార్ ను అదుపులోకి తీసుకున్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :