Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి : హరో.. హర నామస్మరణ లతో శ్రీకాళహస్తి మార్మోగింది ఆడికృత్తిక మహోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం విజ్ఞానగరిపై కొలువుదీరిన స్కందుని దర్శించుకునేందుకు వచ్చిన భక్తజన ప్రవాహంతో ఇక్కడి క్షేత్రంలో సందడి వాతావరణం నెలకొంది పసుపు వస్త్రాలను ధరించి భక్తిశ్రద్ధలతో తలనీలాలు సమర్పించి కావళ్లు పట్టుకొని శరవణభవుని నామస్మరణతో కావళ్ల మొక్కు సమర్పించుకున్నారు. సోమ, మంగళ వారాలు రెండు రోజులు కృత్తిక నక్షత్రం ఉండటంతో మధ్యాహ్నం నుంచి విజ్ఞానగిరి భక్తజన సంద్రంగా మారింది భక్తుల మధ్య తొక్కిసలాటలు లేకుండా క్యూలైన్లను పకడ్బందీగా ఏర్పాటు చేశారు నారద పుష్కరిణి లోను ఇలాంటి ప్రమాదాలు తలెత్తకుండా భద్రత ఏర్పాట్లు చేపట్టారు ఆడికృత్తిక సందర్భంగా విజ్ఞానగిరిపై కొలువుతీరిన కుమారస్వామికి విశేష పూజ ద్రవ్యాలతో అభిషేకాలు జరిపారు అనంతరం చందన రూపుడై భక్తులకు దివ్యదర్శనం కల్పించారు.ఆడికృత్తిక సందర్భంగా ఇంద్ర విమానంపై శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రమణ్య స్వామిని చతుర్మాడ వీధుల్లో ఊరేగించారు కార్యక్రమంలో ఆలయ ఇ.ఓ ఎన్ ఎస్ ఎన్ మూర్తి, ఏసీ మల్లికార్జున ప్రసాద్ ఆలయ సిబ్బంది పాల్గొన్నారు ఉదయం నుంచి రాత్రి వరకు 70 వేల మంది వరకు భక్తులు దర్శనం చేసుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు
Reporter
Telugu Rekha Media