Telugu Rekha Media - ఆంధ్రప్రదేశ్ / తిరుపతి/శ్రీకాళహస్తి : గత వైకాపా ప్రభుత్వంలో పాలకుల ఆర్భాటపు ప్రారంభోత్సవాలకు ఇదో మచ్చుతునక భవనం ప్రారంభించి ఆరు మాసాలు గడుస్తున్నా నేటికీ అందుబాటులోకి రాకపోవడం గమనార్హం శ్రీకాళహస్తి పట్టణంలో ఏళ్ల తరబడి చాలీచాలని ఇరుకు గదుల్లో అద్దె భవనంలో ప్రథమ శ్రేణి గ్రంథాలయం నిర్వహిస్తూ వచ్చారు సొంత భవన నిర్మాణం కోసం 2014 ఫిబ్రవరిలో అప్పటి ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గ్రంథాలయాల సంస్థ చైర్మన్ కన్నయ్య నాయుడు నేతృతంలో పంచాయతీరాజ్ అతిథి గృహం పక్కన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు మై కాపా అధికారంలోకి వచ్చాక ఈ స్థలంపై పలువురు కన్నేశారు దీనిపై కథనాలు రావడంతో ఎట్టకేలకు భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. రూ1.09 కోట్ల భయంతో నిర్మించిన భవనాన్ని ఎన్నికలకు ముందు హడావుడిగా ప్రారంభించారు గ్రంథాలయ మార్పుకు సంబంధించి అధికారులు ఆదేశాలు ఇవ్వలేదు నిర్మాణం పూర్తయిన భవనం అందుబాటులోకి రాకపోవడంతో అవస్థలు తప్పడం లేదని పుస్తక ప్రియులు వాపోతున్నారు..
Reporter
Telugu Rekha Media