Telugu Rekha Media - తెలంగాణ / హన్మకొండ : హనుమకొండ మండలం 54వ డివిజన్ గుండ్ల సింగారం లోని బాల వికాస సంస్థ & వరంగల్ నగర పాలక సంస్థ యందు శనివారం శ్రీ శరణ్య హాస్పిటల్ హన్మకొండ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఉచిత వైద్య శిబిరం లో భాగంగా ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు చేసి, బీపీ, షుగర్ ఉన్న వారికి స్క్రీనింగ్ చేసి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ ట్రామా & జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ ఎ. రాజేందర్ మరియు జనరల్ ఫిజిషియన్ డయాబెటాలజిస్ట్ & క్రిటికల్ కేర్ ఫిజిషియన్ డాక్టర్ పి. రాజ్ కుమార్, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ పూర్ణచందర్ లు పాల్గొని వైద్య సేవలు అందించారు.
ఈ సందర్భంగా ఉచిత వైద్య శిభిరం ఏర్పాటు చేసిన శ్రీ శరణ్య హాస్పిటల్ యాజమాన్యానికి, వైద్యులకు గుండ్లసింగారం ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.
Admin
Telugu Rekha Media