Telugu Rekha Media - తెలంగాణ / హన్మకొండ : హనుమకొండ “శ్రీ రామకృష్ణ సేవా సమితి భవన్“లో బుదవారం యోగా శిక్షణ శిబిరాన్ని వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి-నీలిమా దంపతులు ముఖ్య అతిథిగా విచ్చేసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. యోగా గురువు రవీంద్రాచారి నిర్వహణలో జరిగిన యోగా శిక్షణలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి “యోగా” ను తన జీవితంలో నిత్యకృత్యంగా ఆచరించాలని తద్వారా తన ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, మానసిక వికాసాన్ని పొందడం జరుగుతుందన్నారు. ఆ తర్వాత సేవా సమితి గ్రంథాలయాన్ని సందర్శించి అవసరమైన భగవద్గీత, రామాయణ-భాగవతాది ఆధ్యాత్మిక గ్రంథాలను, పుస్తకాలను సమకూర్చుతానన్నారు.సేవా సమితి అధ్యక్షులు కటంగూరు సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ శ్రీ రామకృష్ణ సేవా సమితి భారతీయ సంస్కృతి సంప్రదాయాలను సమాజం ఆచరింప జేయుటలో, యువతను సత్శీలురుగా తీర్చి దిద్దుటలో, ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవితాన్ని కల్పించుటలో అవసరమైన కార్యక్రమాలు నిర్వహిస్తుందన్నారు. సమితి కార్యక్రమాలయెడ సదవగాహన కలిగిన పెద్దలు, భక్తులు, కార్యకర్తల సహాయసహకారాలతో ఇప్పటికి సుమారు కోటిన్నర వ్యయంతో ఈ స్థితిలో నున్న భవనంయొక్క నాలుగు స్లాబులు పూర్తయినవి. పూర్వ వరంగల్ జిల్లాకు ఇదొక పర్యాటక దివ్య మందిరంగా బాసిల్లుతుందన్నారు.
తర్వాత 59వ డివిజన్ మునిసిపల్ కార్పొరేటర్ గుజ్జుల వసంత-మహేందర్ రెడ్డిలు విశిష్ట అతిథులుగా హాజరవడం హర్షణీయం.సేవా సమితి బాధ్యులు, భక్తులు, కార్యకర్తలు, శ్రీనివాస స్వామి, జినుగు విష్ణువర్ధన్ రెడ్డి, సూర్య, కెవి రావు, నవీన్ రెడ్డి, అశోక్ రెడ్డి, బ్రహ్మానందం, వెంకన్న, వేణుగోపాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, అంజనీదేవి, మూల సరోజన, అనిత, పార్వతి, వీణ తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media