Telugu Rekha Media - తెలంగాణ / జనగాం : అక్రమ అరెస్టులతో ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఆపలేరని బిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి చింత రవి అన్నారు.నిరుద్యోగులకు ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాల హామీ,జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ప్రశ్నించి నిరుద్యోగులకు మద్దతుగా నిలుస్తున్నందుకు దేవరుప్పుల మండల బిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి చింత రవిని పోలీసులు అర్థరాత్రి అక్రమంగా అరెస్టు చేసి దేవరుప్పుల మండల పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా చింత రవి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థి నాయకులపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని,గ్రూప్ 2, గ్రూప్ 3 పెంచాలని వాయిదా వేయాలని,ఇలాంటి అరెస్టులకు భయపడబోమని రానున్న రోజుల్లో నిత్యం నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు.
Reporter
Telugu Rekha Media