Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : పట్టణంలోని మాదాపూర్ కాలనీ లోని రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల జాతర శ్రీ రేణుక ఎల్లమ్మ గౌడ సంఘం యూత్ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు..ఈ సందర్భంగా మహిళలు అమ్మవారికి బోనం నైవేద్యాన్ని సమర్పించారు . ఈ సందర్భంగా యూత్ నాయకులు అమ్మవారిని దర్శించుకోవడం ప్రత్యేక పూజలు నిర్వహించారు..అనంతరం వన మహోత్సవం సందర్భంగా ఆలయ ఆవరణలో మొక్కలను నాటారు. ఈ బోనాల జాతరలో సంఘ నాయకులు బలిజ రాజారెడ్డి, ఆదిపెళ్లి మహేష్ గౌడ్, గారి పెళ్లి ప్రసాద్ గౌడ్, పోతుగంటి రాము గౌడ్, సామల వేణుగోపాల్, అండగొని రామ గౌడ్, గోడాల లింగం గౌడ్, బండి శ్రీనివాస్ గౌడ్ , మోతుకూరి శ్రీనివాస్ గౌడ్, మూర్తి, రాజు ,సాయి కృష్ణ భరత్ ,కళ్యాణ్, సంఘ సభ్యులు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media