Saturday, 13 June 2026 08:17:09 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

వరదల వల్ల నష్టం జరుగకుండా చర్యలు చేపట్టాలి...

-- జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా...

Date : 15 June 2024 08:39 AM

Telugu Rekha Media - తెలంగాణ / భూపాలపల్లి : మోరంచవాగు పరిసరాలలో సాగవుతున్న పంటలు వరద ముంపుకు గురికాకుండా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా, శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శుక్రవారం జెన్కో సిఈ, సింగరేణి అధికారులతో కలిసి ఘణపురం మండల పరిధిలోని దుబ్బపల్లి శివారు మోరంచవాగు పరిసరాలు ముంపుకు గురయ్యే పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే మాట్లాడుతూ గత సంవత్సరం జులై నెలలో వచ్చిన భారీ వర్షాలు కారణంగా మోరంచపల్లి గ్రామం మునిగిపోయి, భారీ నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈ సంవత్సరం అలాంటి సంఘటనలు పునారావృతం కాకుండా జెన్కో అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రతీ ఏటా ముంపుకు కారణమవుతున్న సమీపంలోని జామాయిల్ తోటను పూర్తిగా తొలగించాలని తెలిపారు. మోరంచవాగులో వెంటనే పూడిక తీత పనులు చేపట్టాలని ఆదేశించారు. మోరంచవాగును శుబ్రపరచాలని అలాగే నీళ్లు వేగంగా వెళ్లేందుకు వాగును వెడల్పు చేయాలని సూచించారు. జెన్కో యాష్ పాండ్ దగ్గర నిర్మించిన కాలువను వెడల్పు చేయాలని, దానికి సంబందించిన పనుల మంజూరుకు ఉత్తర్వులు ఇవ్వడం జరుగుతుందని వారం రోజులలోగా పనులు ప్రారంభించాలని ఆయన స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, సింగరేణి అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :