Telugu Rekha Media - తెలంగాణ / పెద్దపల్లి : రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ సత్తా ఏంటో చూపించాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యల ప్రదీప్ కుమార్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ లు అన్నారు, మంగళవారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో జిల్లా బీజేపీ కార్యవర్గ సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.ఈ సమావేశానికి ముఖ్య అతిధిలుగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యల ప్రదీప్ కుమార్, పెద్దపల్లి పార్లమెంట్ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ లు హాజరయ్యారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్, పోడు భూములు, ధరణి, సింగరేణి, మంథని లో డంపింగ్ యార్డ్, ఇంటిగ్రేడ్ మార్కెట్, న్టీపీసీ ఉద్యోగం ల కుంభ కోణం, జెన్ కో, నిరుద్యోగ సమస్య, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన 6 గ్యారెంటీ లను అమలు తదితర సమస్య పై రాజకీయ తీర్మానం చేసి నాయకులకు భవిష్యత్తు కార్యాచరణ వివరించారు.అనంతరం ఏర్పాటు చేసిన సమావేశం లో వారు మాట్లాడుతూ ప్రధాన ప్రతిపక్షంగా రాష్ట్ర లో ప్రజల సమస్యల పై బీజేపీ పార్టీ పోరాటం చేస్తుందని,ప్రజలకి పూర్తి స్థాయి లో న్యాయం చేసే పార్టీ గా బీజేపీ కు మంచి గుర్తింపు కార్యకర్తలు తీసుకరావాలని అన్నారు. గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీజేపీ పార్టీ కి మరింత ఆదరణ పెరిగిందని దానికి పార్లమెంట్ ఎన్నికలే నిదర్శనం అన్నారు, జుట హామీల కాంగ్రెస్ ప్రభుత్వ నిజ స్వరూపం 7 నెలలో ప్రజలకు తెలిసిందని, మంత్రి నియోజకవర్గం డాంప్ యార్డ్, లేకపోవడం సిగ్గుచేటన్నారు,మాత శిశు హాస్పిటల్ సురక్షత ప్రాంతంలో నిర్మించలని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కొండపాక సత్య ప్రకాష్ , రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పర్వతాలు, గోటిముక్కుల సురేష్ రెడ్డి,హనుమంత్ గౌడ్, మాజీ జడ్పీటీసీ లు చల్ల నారాయణ రెడ్డి, కందుల సంధ్య రాణి, సీనియర్ రాష్ట్ర నాయకులు అరుముల్ల పోచం,క్యాతం వెంకటరమణ,అదిరెడ్డి, అన్ని నియోజకవర్గం ల కన్వినర్ లు కో కన్వినర్ లు, మండల అధ్యక్షులు, ఇంచార్జి లు,పాల్గొన్నారు...
Reporter
Telugu Rekha Media