Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : జిల్లా కేంద్రంలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మోతే చెరువు నిండడంతో మోతే చెరువు నీటి మత్తడిని మంగళవారం జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. వరద ప్రభావం పై ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని సంబంధిత అధికారులు సూచించారు. మోతే చెరువు యొక్క మరమ్మత్తులు గవర్నమెంట్ కు మూడు కోట్ల రూపాయలు అవసరమని ప్రతిపాదనలు పంపామని కలెక్టర్ తెలిపారు.. జిల్లాలో 452 మిల్లి మీటర్ల వర్షపాతం సాధారణంగా అయితే 380 శాతం వర్షం అయితే సాధారణంగా కంటే ఎక్కువ పడడం వల్ల వరద ప్రభావం ఉందని అన్నారు.మోతే చెరువుకు సంబంధించి 149 టీఎంసీల తక్కువ,సామర్థ్యం ఉందని ఇప్పటివరకు అయితే ఇబ్బంది ఏమి లేదని అన్నారు. అనంతరం, కండ్ల పెళ్లి చెరువు కూడా పరిశీలించారు. నీటి మట్టం చెరువు యొక్క స్థితిగతులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాకు మరో 3 రోజుల వర్షాలు ఉన్న నేపథ్యంలో అధికారులు అందుబాటులో ఉండాలి కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మధుసూధన్, మున్సిపల్ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media