Saturday, 13 June 2026 06:58:27 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

అమ్మ ఆదర్శ పాఠశాలలో మంజూరైన నిధులతో పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలి...

-- జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్.

Date : 12 July 2024 08:40 PM

Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా మంజూరైన నిధులతో పాఠశాలలోని పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. శుక్రవారం రోజున అమ్మ ఆదర్శ పాఠశాలలో భాగంగా కోరుట్ల ఉర్దూ మీడియం పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలల్లో కనీస మాలిక సదుపాయాలు, విద్యుత్, త్రాగునీరు, పెద్ద, చిన్న మరమ్మత్తుల పనులను పెండింగ్ లో ఉన్నట్లయితే త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. పాఠశాల ప్రహరీ గోడకు బదులు తాత్కాలిక ఫెన్ షింగ్ ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అదే విధంగా పాఠశాలలోని ప్రతీ విద్యార్థి పై ప్రత్యేక దృష్టి సారించాలని, సర్కారు బడుల్లో క్వాలిఫైడ్ ఉపాద్యాయులు పనిచేస్తున్నారని, భావి తరాలకు అవసరమైన విద్యా బోధన చేయడం జరుగుతున్నదని తెలిపారు. డిజిటల్ క్లాస్ నేర్పిస్తున్నారా అని విద్యార్థులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.10 వ తరగతి విద్యార్థులకు వంద శాతం ఉత్తీర్ణత వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని, వెనుక బడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ద వహించి వంద శాతం ప్రగతి సాధించే విధంగా విద్యా బోధనకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో ఆనంద్ కుమార్, డీఈవో జగన్ మోహన్ రెడ్డి, మండల విద్యాధికారి శశి కుమార్, ఎమ్మార్వో, పాఠశాల ఉపాద్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :