Saturday, 13 June 2026 08:24:22 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

జిల్లాలో వంద శాతం పంట నమోదు ప్రక్రియ చేపట్టాలి...

-- అవసరానికి సరిపడా ఎరువులను అందుబాటులో ఉంచాలి... -- వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

Date : 13 July 2024 10:00 PM

Telugu Rekha Media - తెలంగాణ / భూపాలపల్లి : జిల్లాలో వంద శాతం పంట నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. శనీవారం సమీకృత కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్లో వ్యవసాయ శాఖకు సంబంధించి రైతు భరోసా , పంట భీమా, పంట నమోదు, విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందుబాటు, వాటి తనిఖీ లు, మట్టి నమూనాలు సేకరణ, పంట దిగుబడి, లక్ష్యం, సాధింపు, వర్షాభావం నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటలు సాగు తదితర అంశాలపై వ్యవసాయ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వందకు వంద శాతం పంటనమోదు ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపారు. రైతు భరోసా, రైతు భీమా, పీఎం కిసాన్ లాంటి పథకాలను క్షేత్ర స్థాయిలో రైతులకు అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వానాకాలంలో పంటలను కాపాడు కోవడానికి తీసుకునే చర్యలపై రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు అవగాహన కల్పించాలని తెలిపారు. జిల్లాలో ఎరువుల కొరత లేకుండా చూడాలని పంటలకు సరిపడా యూరియా , డిఏపి, ఇతర ఎరువులను అందుబాటులో ఉంచాలని, ఎరువుల కృత్రిమ కొరత, ఎరువులను అధిక ధరకు విక్రయించే వారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు. అధిక దిగుబడి వచ్చే లాభసాటి పంటలు, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలపై రైతులకు అవగాహన కల్పించాలని తెలిపారు. అంతే కాకుండా ప్రతి 15 రోజులకొకసారి పురుగు మందుల దుకాణాలను తనిఖీ చేయాలనీ, నకిలీ విత్తనాలు, పురుగు మందులు విక్రయించే వారి పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్ష పాతం తక్కువ నమోదైన నేపథ్యంలో రైతులు ఆరుతడి పంటల సాగు చేపట్టేందుకు మొగ్గుచూపు విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. వరి విత్తనాలు కొరత లేదని సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. వర్షా భావ పరిస్థితులు నేపథ్యంలో వరి సాగుకు జాప్యం అవుతున్నందున రైతులు వరికి బదులుగా ప్రత్యామ్నయంగా మొక్కజొన్న తదితర ఆరుతడి పంటల సాగు చేపట్టే విధంగా వ్యవసాయ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. రానున్న 15 రోజుల్లో వర్షాలు పడనట్లయితే వరి సాగుకు అనుకూలత లేని కారణంగా ఆరుతడి పంటల సాగు విత్తనాలను అందుబాటులో ఉంచాలని ఆయన సూచించారు. మిర్చి విత్తనాలు అందుబాటులో ఉన్నాయని ఎలాంటి కొరతలేదని ఎక్కడైనా విత్తనాలు కొరత ఉన్నట్లయితే ఆయా మండల వ్యవసాయ అధికారులను కానీ లేదా జిల్లా వ్యవసాయ అధికారిని కానీ సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. ఏదేని సహయతకు జిల్లా వ్యవసాయ అధికారి విజయ భాస్కర్ 7288894787 నంబర్ కు నేరుగా కాల్ చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి విజయభాస్కర్ మండల వ్యవసాయ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :