Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు డీఎస్సీ ద్వారా 25వేల టీచర్ పోస్టులను భర్తీ చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. ఇప్పుడు కేవలం 11 వేల పోస్టులకే నోటిఫికేషన్ ఇవ్వడం సరికాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మనఊరు-మనబడి కార్యక్రమాన్ని కొనసాగించి ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేయాలని సూచించారు. స్కూళ్లలోపారిశుధ్య సిబ్బందిని నియమించాలని, బడులకు ఫ్రీ కరెంటు ఇవ్వాలని కోరారు.
Admin
Telugu Rekha Media