Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : జులై 7 న గోల్కొండ అమ్మవారికి బోనం సమర్పించిన నుండి మొదలుకొని బల్కంపేట అమ్మవారి కళ్యాణం ఉజ్జయిని మహంకాళి బోనాలు రంగం, అంబారీ కార్యక్రమాలతో పాటు 28 వ లాల్ దర్వాజా బోనాలతో పాటు ఆగస్టు 4 గా ఆషాఢ మాస బోనాలు ముగుస్తాయి.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అధికార యంత్రాంగం అంత చాలా శ్రమపడి ప్రజలకు ఎక్కడ ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను ఏర్పాటు చేసింది..ఈ సందర్భంగా ఏర్పాట్లలో భాగస్వామ్యం అయినా ప్రతి ఒక్కరికీ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అభినందనలు, ధన్యవాదాలు తెలుపతున్నా.ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేపట్టిన రాష్ట్ర ప్రజలు బోనాల కార్యక్రమాలకు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి ఈ కార్యక్రమాలు విజయవంతం చేయడానికి జంట నగరాల ప్రజలు సహకారం కావాలని కోరినం. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు అందరూ ప్రజలు అన్ని రకాలుగా సహకరించారు. వారికి ధన్యవాదాలు.ప్రతి కార్యక్రమం ఎక్కడ ఇబ్బందులు లేకుండా ముందస్తుగా రివ్యూలు ఏర్పాటు చేసి నిధుల పెంపు ప్రతిగుడికి అదనంగా నిధులు ఇచ్చి ఏ ఒక్క దేవాలయం కి పెండింగ్ లేకుండా ఉత్సవాలకు ముందే చెక్కుల పంపిణీ చేయడం జరిగింది.ఆర్ అండ్ బి, పోలీస్ రెవెన్యూ దేవాదాయ శాఖ, మెట్రో వాటర్ వర్క్స్ జిహెచ్ఎంసి జిల్లా అధికార యంత్రాంగం అందరూ భాగస్వాములై పని చేశారు. రంగంలో భవిష్య వాణి చెప్పినట్లు రాబోయే కాలంలో అమ్మవారి ఆశీర్వాదంతో ప్రకృతి సహకరించి వర్షాలు సమృద్ధిగా పడి, పాడి పంటలతో రాష్ట్రమంతా బాగుంటుందని అమ్మవారి ఆశీర్వదించారు.ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలంటే ఔషధాలు కలిపిన ఆహారం ఉత్పత్తి చేయడం వాడడం ఆరోగ్యం బాగుండాలంటే ప్రకృతి పరమైన వాటితో ముందుకు పోవాలి.అమ్మవారి బోనాలు విజయవంతంగా జరిగాయి రాష్ట్ర ప్రభుత్వం పక్షాన అందరికీ ధన్యవాదాలు.
Reporter
Telugu Rekha Media