Telugu Rekha Media - తెలంగాణ / సిద్ధిపేట : సిద్దిపేట పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సిద్దిపేట బ్రాంచ్ మరియు ఎస్బిఐ వ్యవసాయ మరియు వాణిజ్యశాఖ బ్రాంచ్ లను విజిట్ చేసిన జిల్లా కలెక్టర్ ఎం. మను చౌదరి రైతు రుణమాఫీ మరియు పంట రుణాల రీ షెడ్యూల్ ను పరిశీలించారు.రోజుకు ఎంతమందికి పంట రుణాల రీషెడ్యూల్ చేస్తున్నారు మరియు పంట రుణ మాఫీలో ఎక్కడైనా సమస్య ఉందా. ఉంటే ఎలా పరిష్కరిస్తున్నారు. వ్యవసాయ శాఖ అధికారులతో సమన్వయం చేస్తున్నారా అని బ్యాంక్కర్లను అడిగి తెలుసుకున్నారు. బ్యాంకులకు పంట రుణాల రీ షెడ్యూల్ కోసం వచ్చిన రైతులతో మాట్లాడి రుణమాఫీ మరియు పంట రుణాల మంజూరు గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు ఆర్థికంగా చేతనందించి వ్యవసాయ రంగంలో మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల రూపాయల వరకు పంట రుణమాఫీ కార్యక్రమం తీసుకువచ్చిందని, లక్ష రూపాయల లోపు విడుదలైన రైతు రుణమాఫీ ప్రక్రియను వెంటనే పూర్తి చేసి ఈనెల నెలాఖరులోగా ఆయా రైతులకు కొత్త రుణాలను అందించాలని అన్నారు. అదేవిధంగా లక్షా లోపు పంట రుణం ఉండి మాఫీ కానీ రైతుల ఫిర్యాదుల స్వీకరించేందుకు ప్రతి బ్యాంకులో ఏర్పాటు చేసిన ఎంక్వైరీ సెంటర్లో అవసరమైతే అదనంగా మరో కౌంటర్ ను ఏర్పాటు చేసి వ్యవసాయ శాఖ అధికారుల సమన్వయంతో పరిష్కరించాలని అన్నారు. ప్రతి బ్యాంకులో ప్రతిరోజు 100 రుణాల రెన్యువల్ చేయాలని ఎల్డీఎం హరిబాబును ఆదేశించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ వికాస్, మేనేజర్ సురేష్, ఎస్బిఐ చీఫ్ మేనేజర్ జయంత్, మేనేజర్ సుధీర్ ఆయా బ్యాంకుల సిబ్బంది తదితరులు ఉన్నారు.
Reporter
Telugu Rekha Media