Saturday, 13 June 2026 08:17:18 AM
# ఘనంగా గురుపౌర్ణమి మహోత్సవము # వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం.. తెలంగాణకు ఐదురోజులు వర్ష సూచన..! # నాపై ఎన్ని అక్రమ కేసులు పెట్టుకుంటావో పెట్టుకో.. మిస్టర్ రేవంత్ రెడ్డి…. అంటూ హరీశ్ రావు ఫైర్. # కేటీఆర్ ను కలిసిన టీటీడీ ఛైర్మన్ # లక్నవరం సరస్సులో మూడవ ద్వీపం ప్రారంభం # సాంస్కృతిక కళా వాహనాలను ప్రారంభించిన మంత్రి పొన్నం # ఎయిర్ పోర్టుకు రూ. 205 కోట్లు కేటాయింపు.. మంత్రి హర్షం.. # ప్రైవేటు బడులకు దీటుగా ప్రభుత్వ బడుల్లో సౌకర్యాలు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి # ప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంపుపై దృష్టి సారించండి # దీపావళి షాపుల వద్ద అగ్నిమాపక శాఖ అవుట్ పోస్ట్ # కులగణను ప్రతిప్ఠాత్మకంగా తీసుకోవాలి # చంద్రబాబుతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల భేటీ.. # బీజేపీ లో బిఆర్ఎస్ విలీనం అవుతుంది... # పోషణ ఆరోగ్య జాతర పై జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సమీక్ష.. # ‘ఆయ్’ సినిమా కథ విన్నప్పుడు నేనెలాగైతే ఎంజాయ్ చేశానో.. థియేట‌ర్స్‌లో ఆడియెన్స్ ఇప్పుడ‌లా ఎంజాయ్ చేస్తున్నారు # జర్నలిస్టుల దీక్షలు 14వ రోజు.. # జీఎల్‌సీలో భాగస్వామిగా టాటా అంగీకరించింది... # ఫోర్త్ సిటీ ఏర్పాటులో మీ విజ‌న్ అద్భుతం.. # గచ్చిబౌలిలో రూ.4 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత.. ఎనిమిది మంది స్మగ్లర్ల అరెస్టు.. # ప్రయాణికులకు టీజీఎస్‌ఆర్టీసీ గుడ్ న్యూస్..

తరగతి గదుల్లో విద్యార్థుల భవితవ్యం రూపుదిద్దుకుంటుంది... ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించాలి...

-- జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

Date : 25 July 2024 06:22 PM

Telugu Rekha Media - తెలంగాణ / భూపాలపల్లి : గురువారం రేగొండ మండల కేంద్రంలోని జడ్.పి.హెచ్.ఎస్ పాఠశాల, కస్తూరిబా గాంధీ విద్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తరగతి గదుల్లో విద్యార్థుల భవితవ్యం రూపుదిద్దుకుంటుందని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యాబోధన జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. గురువారం రేగొండ మండలంలో పర్యటించిన కలెక్టర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 11 లక్షల రూపాయల నిధులతో చేపట్టిన కిచెన్ షెడ్ నిర్మాణం, బాలికల మరుగుదొడ్లు నిర్మాణ పనులను పరిశీలించి త్వరిత గతిన పూర్తిచేయాలని ఆదేశించారు. 6వ తరగతి విద్యార్థులతో మాట్లాడి పలు ప్రశ్నలు వేసి సమాదానాలు రాబట్టారు. వంట గదిని పరిశీలించి వెళ్లి మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. మెరుగైన మౌలిక వసతులు కల్పించి విద్యార్థులకు నాణ్యమైన విద్య బోధన అందించేందుకు చేపట్టిన మరమ్మతుల పనులను వేగవంతంగా పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆదేశించారు. అనంతరం కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించారు. నిర్మాణంలో ఉన్న జూనియర్ కళాశాల భవన నిర్మాణం గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. వంట గదిని పరిశీలించి మెనూ ప్రకారం విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని తెలిపారు. పదవ తరగతి గదిని పరిశీలించి విద్యార్థినులతో ఇంగ్లీష్ పాఠాలు చదివించారు. బాగా చదువుకొని మంచి ర్యాంకులు సాధించాలని సూచించారు. విద్య మాత్రమే మనిషిని ఉన్నత స్థితికి తీసుకురాగలదని కష్టంగా కాకుండా ఇష్టంగా చదవాలని సూచించారు. గురువులు చెప్పే పాఠాలను విద్యార్థులు శ్రద్ధగా విని ఏవేని సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని తెలిపారు. విద్యాలయ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, దోమలు, ఈగలు వ్యాప్తి జరుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. వ్యాధులు ప్రబలితే తక్షణమే వైద్యాధికారుల దృష్టికి తేవాలని, విద్యార్థులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. అనంతరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి ఫార్మసి, ల్యాబ్, లేబర్ రూమ్, క్యాజువాలిటిని పరిశీలించి ఆసుపత్రి లో అందిస్తున్న వైద్య సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇంటింటి జ్వర సర్వేనిర్వహించాలని జ్వరాలు ఎక్కువగా ఉన్న గ్రామాలలో మెడికల్ క్యాంపులు నిర్వహించి వ్యాధుల నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులు ప్రబల కుండా తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తల గురించి పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాజేందర్, తహశీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపిడిఓ వెంకటేశ్వర రావు, డాక్టర్ హిమబిందు, పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.

Prashanth Pothkanoori

Reporter

Telugu Rekha Media

మరిన్ని వార్తలు

Copyright © Telugu Rekha Media 2026. All right Reserved.



Developed By :