Telugu Rekha Media - తెలంగాణ / సిద్ధిపేట : సిద్ధిపేట (తెలుగు రేఖ న్యూస్): విధినిర్వహణలో మృతిచెందిన పోలీసులకు డిపార్ట్మెంట్ ఎప్పుడు అండగా ఉంటుంది. గత కొన్ని రోజుల క్రితం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన హెడ్ కానిస్టేబుల్ తిరుపతి, కుటుంబ సభ్యులకు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అందవలసిన బెనిఫిట్స్ లో భాగంగా పోలీస్ భద్రత నుండి వచ్చిన 8,000,00 లక్షల చెక్కును కమిషనర్ కార్యాలయంలో తిరుపతి కుటుంబ సభ్యులకు అందజేసిన పోలీస్ కమిషనర్ తదనంతరం వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితి తదితర అంశాల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ విధినిర్వహణలో మృతి చెందిన పోలీస్ కుటుంబ సభ్యులకు డిపార్ట్మెంట్ ఎప్పుడు అండగా ఉంటుందన్నారు. తిరుపతి కుటుంబ సభ్యులకు రావలసిన మరికొన్ని బెనిఫిట్స్ త్వరలో అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ యాదమ్మ, బి సూపరిండెంట్ జమీల్ అలీ, జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
Admin
Telugu Rekha Media