Telugu Rekha Media - తెలంగాణ / జగిత్యాల్ : జిల్లాలో ప్రజలకు మరిన్ని మెరుగైన సేవలు అందించడానికి మొబైల్ ఫోన్లు రికవరీ కోసం జిల్లాలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేయడం జరిగిందని, గత సంవత్సరం పోర్టల్ ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 411 ఫోన్ లను రికవరీ చేసి బాధితులకు అందించడం జరిగిందని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు..ఎవరైన మొబైల్ పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన వెంటనే CEIR పోర్టల్ ( https://www.ceir.gov.in ) నందు బ్లాక్ చేసి, సంభందిత పోలీసు స్టేషన్ లో సమాచారం ఇవ్వాలని సూచించారు.పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి సీఈఐఆర్ వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని సీఈఐఆర్ వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని ఎస్పీ తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో సీఈఐఆర్ ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి నష్టాన్ని కాజేస్తుందన్నారు. ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా ఐఎంఈఐ నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు. అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా ఎస్పీ సూచించారు.
Reporter
Telugu Rekha Media