Telugu Rekha Media - తెలంగాణ / మంచిర్యాల : సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో మహిళలకు బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని సింగరేణి సంస్థ రామగుండం రీజియన్ 3 జిఎం సుధాకర్ రావు తెలిపారు. 45సంవత్సరాల వయస్సు పైబడిన సింగరేణి మహిళా ఉద్యోగులు మరియు అర్హత గల ఉద్యోగుల మహిళా కుటుంబ సభ్యుల కోసం సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్, హైదరాబాద్ వారిచే ఈనెల 27 వ తేదీన ఉదయం 8:00 గంటల నుండి సాయంత్రం 5:00 గంటల వరకు రామగుండం ఏరియా (గోదావరిఖని) హాస్పిటల్ లో బ్రెస్ట్ స్క్రీనింగ్ క్యాంప్ నిర్వహించబడునని రామగుండం-3 ఏరియా జనరల్ మేనేజర్ ఎన్.సుధాకర రావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ కె.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ స్క్రీనింగ్ క్యాంపులో పరీక్షలు చేయించదలుచుకున్న మహిళలు ఈనెల 24 , 25 తేదీలలో సింగరేణి సంస్థ వారి రామగుండం ఏరియా ఆసుపత్రి లో పేర్లు నమోదు చేయించుకోవాలని అన్నారు. నమోదు చేయబడిన వంద మంది మహిళలకు మాత్రమే ఈ స్క్రీనింగ్ క్యాంప్ లో పరీక్షలు చేయబడునని, కావున ఇట్టి అవకాశాన్ని మహిళలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు.
Reporter
Telugu Rekha Media