Telugu Rekha Media - తెలంగాణ / ఆదిలాబాద్ : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, వరంగల్, హనుమకొండ జిల్లాల అడ్మినిస్ట్రేటీవ్ న్యాయమూర్తి జస్టిస్ మౌషిమి భట్టాచార్య హనుమకొండలో జరుగుతున్న వరంగల్, హనుమకొండ జిల్లాల న్యాయాధికారుల సమావేశంలో పాల్గొనేందుకు శనివారం వచ్చారు. హనుమకొండ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద హనుమకొండ, వరంగల్ జిల్లా కోర్టుల ప్రధాన న్యాయమూర్తులు జస్టిస్ రమేష్ బాబు, జస్టిస్ నిర్మలా గీతాంబ, హనుమకొండ జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్య, వరంగల్ జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి, తదితరులు పుష్పగుచ్చాలు, మొక్కలను తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి, వరంగల్, హనుమకొండ అడ్మినిస్ట్రేటీవ్ జడ్జి జస్టిస్ మౌషిమి భట్టాచార్య కు అందించి ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు జీవన్ గౌడ్, రమేష్ బాబు, న్యాయాధికారులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
Reporter
Telugu Rekha Media