Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి, ప్రఖ్యాత శాస్త్రవేత్త డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వారికి ఘనంగా నివాళులర్పించారు. సీఎం నివాసంలో పలువురు ప్రజాప్రతినిధులతో కలిసి కలాం గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. దేశం కోసం జీవితాన్ని ధారపోసిన మహనీయుడు స్వర్గీయ కలాం ని ముఖ్యమంత్రి స్మరించుకున్నారు. ఒక శాస్త్రవేత్తగా భారత రక్షణ పరిశోధనా రంగంలో, అంతరిక్ష పరిశోధనా రంగంలో కలాం చేసిన కృషిని దేశం ఎప్పటికీ విస్మరించబోదని సీఎం పేర్కొన్నారు. తన రచనలతోనూ యువతలో దేశ సేవ పట్ల స్ఫూర్తి నింపిన మహనీయుడు కలాం అని ముఖ్యమంత్రి గుర్తుచేశారు.
Reporter
Telugu Rekha Media