Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : ఉబేర్ సంస్థ ప్రతినిధులు బుధవారం నాడు సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ను కలిసారు. ఈ సందర్భంగా పలు అంశాలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. తెలంగాణ లో ఉబెర్ సేవలు మరింత విస్తృత పరచడం.ఉబెర్ లో ప్రయాణం చేసే మహిళలకు మరింత భద్రత కోసం అధునాతన టెక్నాలజీ ఉపయోగం, ఉబెర్ ద్వారా మరింత ఉద్యోగ అవకాశాలు. కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా ఉబెర్ లో ఎలక్ట్రిక్ వాహనాలు నడిపేలా చర్యలు తదితర అంశాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఉబెర్ ప్రతినిధుల బృందం చర్చించారు. బృందంలొ సంజయ్ శ్రద్ధ, ఉమా బట్, మేఘా సింగ్ వున్నారు.
Reporter
Telugu Rekha Media