Telugu Rekha Media - తెలంగాణ / హైదరాబాద్ : తార్నాకలోని ఆర్టీసీ ఆస్పత్రిలో శనివారం నూతనంగా ఏర్పాటు చేసిన సిటీ స్కాన్, ఎంఆర్ఐ ఆధునిక వైద్య పరీక్షా కేంద్రాలతో పాటు ఫిజియోథెరఫీ యూనిట్, ఆపరేషన్ థియేటర్ కాంప్లెక్స్, ఫార్మసీని రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. తరువాత తార్నాక ఆర్టీసీ ఆస్పత్రిని ఆయన సందర్శించారు. చికిత్స కోసం వచ్చిన ఆర్టీసీ సిబ్బందితో ఆయన ముచ్చటించారు. ఈ కార్యక్రమాల్లో టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, సంస్థ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. తార్నక ఆర్టీసీ ఆస్పత్రిలో వైద్యులతో మంత్రి సమావేశమయ్యారు. సిబ్బందికి అందిస్తోన్న వైద్య సేవల గురించి వారిని అడిగి తెలుసుకున్నారు. అంతకముందు ఆస్పత్రి ప్రాంగణంలో మొక్కను నాటారు.
Reporter
Telugu Rekha Media